బంజారాహిల్స్ : పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో నీటి సమస్యలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని ఆరు బస్తీల్లో కమ్యూనిటీహాల్స్, స్కూళ్ల వద్ద నీటి సమస్యల పరిష్కారం కోసం బోర్వెల్స్ కోసం ఎమ్మెల్యే దానం నాగేందర్ నిధులను మంజూరు చేశారు.
గురువారం నిధుల మంజూరు పత్రాలను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డికి అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అవసరమైన చోట్ల బోర్వెల్స్ వేయిస్తామని పేర్కొన్నారు.