నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 12: నాగర్కర్నూల్ జిల్లా వట్టెం వెంకటాద్రి రిజర్వాయ ర్ నిర్వాసితులను ఆదుకుంటామని కలెక్టర్ శర్మన్చౌహాన్ వెల్లడించారు. పునరావాసాల కోసం ప్రభుత్వ సహాయంతో మౌలిక వ సతుల ఏర్పాటుకు త్వరలోనే టెండర్లు పి లువనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్రెడ్డితో కలిసి ముంపు గ్రామాల ప్రజలు, కమిటీ సభ్యులతో సోమవారం సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భం గా నిర్వాసితుల పునరావాసానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై చర్చించారు. నిర్వాసితుల్లో కారుకొండ తండా, అన్కాన్పల్లి తండా, జిగుట్ట తండావాసులు ఉన్నారన్నారు. మొత్తం గా 466 కుటుంబాలను గుర్తించామని, వారందరికీ వట్టెం గట్టు వద్ద పునరావాసం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. మౌలిక వసతుల కల్పనకు గానూ రూ. 23కోట్ల అవార్డు పాస్ చేశామన్నారు.
అం దులో పాఠశాల, అంగన్వాడీ, పీహెచ్సీ, గ్రామ పంచాయతీ భవనం, పార్కులు, క మ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి వాటిని చేర్చినట్లు వారు కమిటీ దృష్టి కి తీసుకొచ్చారు. ఇప్పటికే 466 ప్లాట్లకు లేఅవుట్ సిద్ధం చేశామని, కుటుంబాల వారీగా ఎవరికి ఎక్కడ కావాలో నిర్ణయం తీసుకొని కమిటీ ద్వారా ఆమోదం తెలిపితే వెంటనే పట్టా సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలు సైతం కమిటీ ఆమోదం తె లిపిన అనంతరం టెండర్లు పిలుస్తామని తె లిపారు. టెండర్లు పాస్ అయిన వెంటనే ఏ కకాలంలో నిర్వాసితులు ఇండ్ల నిర్మాణాలు చేసుకోవచ్చని, అదే సమయంలో మౌ లిక వసతుల పనులు కూడా ప్రారంభమవుతాయని వివరించారు. అనంత రం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మా ట్లాడుతూ వట్టెం పునరావాస కేం ద్రాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనదిగా తీర్చిదిద్దాలని కలెక్టర్ను కోరారు. రాష్ట్రంలో పునరావాస కేంద్రాల పరిశీలనకు వెళ్లాలనుకుంటే వెం టనే నాగర్కర్నూల్ గుర్తొచ్చేవిధంగా రూపుదిద్దాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయినప్పటికీ ప్రభుత్వం నష్టపరిహారం కల్పించడమే కాకుండా పునరావాకేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించారనే సంతృప్తిని నిర్వాసితులకు కలిగించాలని సూచించారు. నిధుల కొరత ఉంటే తన నిధుల నుంచి కేటాయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న నిర్వాసితులు పునరావాస ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. చేపలు పట్టుకొనేందుకు నిర్వాసితులకు హక్కు కల్పించాలని, వీలుంటే నిర్వాసితుల్లో కొందరికి ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో నాగలక్ష్మి, నీటి పారుదల డీఈ ప్రతాప్, పార్థసారథి, కమిటీ సభ్యులు, నిర్వాసిత గ్రామ పెద్దలున్నారు.