శ్రీరంగాపూర్, ఏప్రిల్ 5 : ఛత్తీస్గఢ్లో జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడిలో చనిపోయిన వీర జ వాన్ల ఆత్మశాంతి కోసం సోమవారం యువకులు, ప్ర జాప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి నాయకుడు సంపత్ నాయుడు మాట్లాడుతూ జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టులు సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకోవాలని సూచించారు. జవాన్లపై దాడుల వల్ల మావోయిస్టులు పైశాచిక అనందం తప్ప ప్రయోజం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమేశ్కుమార్, శ్రీరంగాపూర్ క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు.