బన్సీలాల్పేట్: ఇటీవల ఆగ్రాలో జరిగిన ‘మిస్టర్ అండ్ మిసెస్ ఇండియా’ పోటీలలో సికింద్రాబాద్కు చెందిన రేణికుంట మారుతీచరణ్ తన సత్తా చాటాడు. మారుతీచరణ్ సికింద్రాబాద్ పద్మారావునగర్లోని సర్దార్ పటేల్ కళాశాలలో బీఏ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.‘మిస్టర్ అండ్ మిసెస్ ఇండియా’ పోటీలలో శారీరక ధారుఢ్యత కనబరచి ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ గెలుచుకున్నాడు. మారుతీచరణ్ చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ , బాడీబిల్డింగ్, మోడలింగ్ రంగాలలో కూడా రాణిస్తున్నాడు.
కాగా మారుతీచరణ్ రాబోయే కాలంలో మరిన్ని పతకాలను సాధించి, దేశానికి, రాష్ట్రానికి, కళాశాలకు మంచి ఖ్యాతి తీసుకురావాలని కళాశాల పాలకమండలి ప్రధాన కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.నర్మద, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అమరనాథ శర్మలు మారుతీచరణ్ను శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మారుతీ చరణ్ మాట్లాడుతూ తాను ర్యాంప్వాక్ ప్రాక్టిస్ చేస్తున్నానని, మిస్టర్ ఇండియా పోటీలలో ఇంటర్యూలకు సిద్ధం అవుతున్నానని తెలిపారు. నగరంలో జరిగిన మిస్టర్ అండ్ మిసెస్ పోటీలలో ఫైనలిస్ట్గా నిలిచానని, మిస్టర్ ఫోటోజెనిక్ హైద్రాబాద్ పోటీలలో విజేతగా నిలిచానని అన్నారు. మిస్టర్ ఏసియా, మిస్టర్ బాలీవుడ్ పోటీలలో సెమీ ఫైనల్స్ అర్హత సాధించానని తెలిపారు.