వనస్థలిపురం : స్వయం ఉపాధిరంగంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, యువత వాటిపై దృష్టి సారించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. హస్తినాపురం ఉర్మిళనగర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన దావత్ బిర్యానీ పాయింట్ను ఆయన బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం ఉపాధి పొందగోరేవారికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందడంతోపాటు మరికొంత మందికి ఉద్యోగం కల్పించవచ్చన్నారు. దావత్ బిర్యాని పాయింట్ను స్థాపించిన సునీల్కుమార్, అనిల్కుమార్, నవీన్, వెంకట్లను అభినందించారు.
కార్యక్రమంలో చింతల రవికుమార్, లగ్గోని శ్రీధర్గౌడ్, అనిల్ దరి, అజయ్యాదవ్, వేములయ్యగౌడ్, సంజయ్కుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.