డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 19 : టీఆర్ఎస్ పాలనలో గ్రామాలకు మహర్దశ పట్టిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రామాజీపేటలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పల్లె ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చి గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు బైండ్ల రామచంద్రయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎనీ టైం వాటర్ ఫిల్లర్ను ప్రారంభించారు.
ఇటీవల అనారోగ్యానికి గురైన గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఆరె బాలయ్యను పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. జై భీమ్ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచ్ తిరుమల, ఎంపీటీసీ పోషయ్య, నాయకులు శేఖర్రెడ్డి, రాంచందర్, స్వామి, అంజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.