బేగంపేట్:శ్రావణ శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనిమిచ్చారు. ఓ వైపు వరలక్ష్మీ వ్రత పర్వదినం, మరో వైపు అమ్మవారిని గాజులతో అలంకరించడంతో దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. అమ్మవారికి పూలు, పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈవో గుత్తా మనోహరరెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.