వైకుంఠధామాలను సుందరంగా తీర్చిదిద్దాలి
చెత్త సేకరణలో ప్రజలకు అవగాహన కల్పించాలి
తడి చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేయాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్రావు
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో చేపడుతు న్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి పే రుందని, గ్రామాలు పారిశుధ్యం పాటిస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప్ర భుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావుతో కలిసి గురువారం రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, డీఆర్డీవో తదితర శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్లె ప్రగతి, పారిశుధ్యం, ఉపాధి హామీ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలను సుందరంగా తీ ర్చిదిద్ది వినియోగంలోకి తీ సుకురావాలని పేర్కొన్నా రు. చెత్త సేకరణలో ప్రజలకు అవగాహన కల్పించి, తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని సూచించా రు. సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా తడి చెత్తతో సేంద్రి య ఎరువులను తయారు చేయాలని, ప్లాస్టిక్ను వేరు చేసి రీసైక్లింగ్కు పంపించాలన్నారు. ప్రభు త్వ భవనాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భ వనాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాల కార్యదర్శులను ఆదేశించారు. ఉ పాధి హామీ పథకంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని, కూలీల సంఖ్యను పెంచడంతోపాటు, పని దినాలను పెం చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా కృషి చేస్తున్నామని, వివిధ కారణాల వల్ల చనిపోయిన మొక్కల స్థానంలో కొ త్తవి నాటేలా గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసిన ట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు పంచాయతీ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.