డీఎస్పీ కిరణ్కుమార్
వనపర్తి రూరల్, మార్చి 30 : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసు సమానమేగాక పోలీసులకు వేయి ఏనుగుల బలంగా మారనున్నదని డీఎస్పీ కిరణ్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్సై వెంకటేశ్గౌడ్ల సహకారంతో పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్లతో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేను సైతం కార్యక్రమం ద్వారా పట్టణంలోని వార్డు ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ కాలనీల్లో వంద వైర్ లెస్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఆదేవిధంగా నేర దర్యాప్తులోను సీసీ కెమెరాల్లో దృష్యా లు ప్రధాన సాక్ష్యంగా నిలవడంతోపాటు నేరానికి పాల్పడిన వారికి తగిన శిక్షపడటంతో ఈ సాక్ష్యం కీలకంగా పరిగణించబడుతోందన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొనేలా మున్సిపల్ పాలకవర్గం సహకరిస్తుందని ఆశీస్తున్నట్లు తెలిపారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ పౌరుల భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచిదని, దానికి మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ పాలక వర్గం సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.