పాన్గల్, అక్టోబర్ 22 : టీఆర్ఎస్ సర్కార్ అ భివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బండపల్లి గ్రామంలో సీసీరోడ్లు, పాఠశాల ప్రహరీ, కొత్తపేటలో సీసీరోడ్లు, మాందాపూర్ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మాందాపూర్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సైన్స్ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమశిల-సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం, సింగోటం నుంచి గోపల్దిన్నె వరకు రిజర్వాయర్ నిర్మాణం, సింగోటం లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి నిధుల కేటాయింపుతో భవిష్యత్లో కొల్లాపూర్ రూపురేఖలు మారనున్నాయన్నారు. రైతులు ఎప్పటికప్పుడు నూతన వ్యవసాయ పద్ధతులు అనుసరించి అధిక లాభా లు పొందాలన్నారు. విద్యార్థులు సృజనాత్మకత, ప్రశ్నించే తత్వం, హేతువాదం వంటి శాస్త్రీయ వైఖరులను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ భా గ్యలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ బాలయ్య, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మునీరొద్దీన్, వైస్ ఎంపీపీ కవిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘుపతినాయుడు, డీఈవో రవీందర్, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, తాసిల్దార్ చక్రపాణి, ఎంఈవో లక్ష్మణ్నాయక్, సర్పంచులు రాజేశ్వరమ్మ, జయరాములుసాగర్, మంజుల, ఉపసర్పంచ్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్రెడ్డి, నాయకులు వెంకటయ్యనాయుడు, రామ్మూర్తి నాయుడు, రాముయాదవ్, చంద్రశేఖర్నాయక్, రవికుమార్, రా మస్వామి, రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.