పామాయిల్ సాగు పెంచే దిశగా ఏర్పాట్లు
పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
భారీగా ఆదాయం వచ్చే పంటగా గుర్తింపు
బీచుపల్లిలో నర్సరీ, ప్రాసెసింగ్ ప్లాంటు
ఆయిల్ ఫెడ్ పరిధిలోకి జోగుళాంబ, ‘పేట’ జిల్లాలు
మిగతావి ప్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలోకి..
వంట నూనెల లోటును పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పాం సాగుపై దృష్టి సారించింది. ఈ పంటలు సాగు చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని రైతులను ప్రోత్సహిస్తున్నది. పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించడంతో పాటు 35 ఏండ్ల పాటు లాభాలు ఆర్జించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. పేటలో 273 ఎకరాలు, వనపర్తిలో 232, మహబూబ్నగర్లో 231, గద్వాలలో 225, నాగర్ కర్నూలు జిల్లాలో 220 ఎకరాలు (మొత్తంగా 1181 ఎకరాల్లో) ఈ మొక్కలు నాటారు. గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఆయిల్ పాం సాగు టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో సాగుతున్నది. ఇక వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పర్యవేక్షిస్తుంది. దీంతో తోటల పెంపకానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.
మహబూబ్నగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రై తులకు దీర్ఘకాలికంగా ఆ దాయం అందించే ఆయిల్పాం సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఈ పంటను సాగుచేసేలా అన్నదాతలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే గతేడాది పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లాలో ఆ యిల్పాం సాగును చేపట్టిన సర్కారు ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. సబ్సిడీలు అందిస్తున్నది. సుమారు 35 ఏండ్లపాటు పంట ను అందించే ఆయిల్పాం ద్వారా రైతులు లాభా లు అర్జించే అవకాశం ఉందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఆయిల్పాం సాగు పెరిగితే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది నారాయణపేటలో 273, వనపర్తిలో 232, మహబూబ్నగర్లో 231, జోగుళాంబ గద్వాలలో 225, నాగర్కర్నూల్ జిల్లాలో 220 ఎకరాలు మొత్తం 1,181 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేపట్టారు. రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి ని రంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తమ పొలాల్లో సాగు చేశారు.
ఆయిల్ ఫెడ్ పరిధిలో జోగుళాంబ, పేట జిల్లాలు..
జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో టీ ఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్పాం సాగు కొనసాగుతున్నది. వనపర్తి, నాగర్కర్నూల్, మ హబూబ్నగర్ జిల్లాల్లో ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పర్యవేక్షిస్తున్న ది. రైతులను ఎంపిక చేసే ప్రక్రియ అంతా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. రైతులకు మొక్కలు పంపిణీ చేసి వారు పండించిన పం టను కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ చేసే బా ధ్యత మాత్రం ఆయిల్ ఫెడ్, ప్రీ యూనిక్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు చూసుకుంటాయి. రైతులకు సబ్సిడీ ఇవ్వడం, శిక్షణ కార్యక్రమాలు, సలహాలు, సూచనలు చేపట్టడం అంతా ఉద్యానశాఖ బాధ్యత. బీచుపల్లిలో గతంలో ఉన్న విజయ ఆయిల్ మిల్లో ఇప్పుడు రెండు ఆయిల్ పాం నర్సరీలు ఏర్పాటు చేసి 2.70 మొక్కలను సిద్ధం గా ఉంచారు. 1.70 విత్తనాలను మలేషియా నుం చి దిగుమతి చేసుకొని వనపర్తి జిల్లాలో నర్సరీ ప్రారంభించారు. ఇప్పటికే టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో నర్సరీలోనూ ఆ యిల్ పాం మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇక బీచుపల్లి వద్ద నర్సరీలో నవంబర్, డిసెంబర్ నాటికి మొక్కలు సిద్ధం అవుతున్నాయి. 12 నెల ల వయసు, 12 నుంచి 14 ఆకులు, 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు, మొక్క మొదలు వద్ద 20 నుం చి 25 సెం.మీ విస్తీర్ణం కూడా ఉండాలి. వాటిలో ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసి రైతులకు అందించనున్నారు. చీడ పీడ లేని మొక్కలను మాత్రమే పంపిణీ చేస్తారు. మూడేండ్లు దాటిన తర్వాత నుంచి పంట చేతికి వస్తుంది. 35 ఏండ్లు ఆదాయం వస్తుంది. మంచి మొక్క నాటితే రైతు కు లాభాలు వస్తాయి. మొక్క విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎకరా పొలంలో త్రిభుజాకారంలో 9 మీటర్ల చొ ప్పున దూరం పాటిస్తూ 57 మొక్కలు నాటుతా రు. మూడేండ్ల వరకు అంతర పంటలుగా బొప్పా యి, అరటి, పల్లి తదితర పంటలు వేసుకోవచ్చు. మూడేండ్ల తర్వాత పంట చేతికి వస్తుంది. తొలి ఏడాది ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పంట వ స్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా ట న్నుకు రూ.20 వేల వరకు ధర పలికింది. ప్రస్తు తం రూ.15 వేలకు పైగా ధర పలుకుతున్నది. అంటే తొలి ఏడాది ఎకరాకు సుమారుగా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. 4 నుంచి 10 ఏండ్ల వరకు ఏటా రెండు టన్నుల చొప్పున దిగుబడి పెరుగుతూ వస్తుంది. 10 ఏండ్ల నుంచి 35 ఏండ్ల వరకు సుమారు 12 నుంచి 16 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రైతు సస్యరక్షణ చర్యలను బట్టి దిగుబడి ఎకరాకు 20 టన్నుల వరకు సైతం రావచ్చు. గతంలో కోస్టారికా నుంచి మొక్కలు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం మలేషియా నుంచి అంతకంటే మెరుగైన వంగడాలను తీసుకురావడంతో దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉంది. నీటి లభ్యత, సమయానుకూలంగా పోషకాలు అందిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. బాగా పెరిగిన పామాయిల్ తోటలో ఎకరానికి సుమారుగా ఏడాదికి 15 టన్నుల పంట తీయవచ్చు. కనీసంగా రూ.15 వేల చొప్పున గెలలు విక్రయించినా రూ.2,25,000 వస్తుంది. రూ.45 వేల వరకు ఖర్చులు పోయినా రూ.1.80 లక్షల మేర రైతులకు గిట్టుబాటు అవుతుంది. మ రోవైపు అంతర పంటల ద్వారా సైతం భారీ లా భాలు అర్జించే అవకాశం ఉంది. అంతా కలిపి ఎకరాకు రూ. 3 లక్షల వరకు సంపాదించొచ్చు. ప్ర స్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు భారీగా పెరిగిన నేపథ్యంలో సాగునీటి లభ్యత పెరిగింది. అం దుకే వరి సాగును వదిలి ఆయిల్ పాం వైపు రావాలని అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ, నారాయణపేట, వనపర్తి (కడుకుండ్ల)లో నర్సరీలు ఏర్పాటు చేశారు. బీచుపల్లిలో ప్రాసెసింగ్ సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నారు. తర్వాత జిల్లాల వారీగా ప్రాసెసింగ్ సెంటర్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటికి తోడు రైతు పండించిన పంటను ఎక్కడికక్కడ కొనుగోలు చేసేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో రైతులకు మార్కెటింగ్ సమస్యే ఉండదు. పంట విక్రయించిన తర్వాత ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుంది. దళారీల వ్యవస్థే లేకుండా ఉన్న చోటే చక్కని లాభాలు అర్జించేందుకు ఆయిల్ పాం ఉత్తమ పంటగా ఉండనున్నది.
తొలి ఏడాది రెండు జిల్లాల్లో..
ఆయిల్పాం సాగు ఈ ఏడాది జోగుళాంబ గ ద్వాల, నారాయణపేట జిల్లాల్లో చేపట్టనున్నారు. ఇందుకుగానూ ఇప్పటికే రెండు జిల్లాల్లో కలిపి 3 వేల ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించారు. ఇందులో చా లా మంది రైతులు మొక్కల కోసం తమ వాటా డబ్బులు చెల్లించారు. త్వరలో డ్రిప్ పనులు పూర్తి చేసి నవంబర్లో రైతులకు మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన జిల్లాలకు సంబంధించిన మొక్కలు నర్సరీలో పెంచుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని వచ్చే ఏడాది నుంచి మొక్కలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదే ఔత్సాహిక రైతులెవరైనా ముందుకొస్తే మొక్కలు పంపిణీ చేసేందుకు ఏ ర్పాట్లు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రాధాన్యత క్రమంలో మొక్కల పంపిణీ చేపట్టనున్నారు. ఆసక్తి ఉన్న రైతులకు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.
రైతులకు భరోసా కల్పించేందుకు..
ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి ల భ్యత పెరిగినందున అంతా వరి సాగు చేస్తున్నారు. పెద్దగా లాభాలు రావడం లేదు. దేశం లో ఇప్పటికే రానున్న రెండున్నరేండ్లకు సరిప డా ధాన్యం అందుబాటులో ఉంది. అందుకే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం సాగుకు అనేక రకాల సబ్సిడీ కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వం పిలుపు మేరకు ఆయిల్పాం సాగు చేపట్టాను. రైతులకు ఆదర్శంగా నిలవడంతోపాటు భరోసా కల్పించాలని ముందుగా గతేడాది 14 ఎకరాల్లో పంట సాగు చేశాను. ఈ పంట మన ప్రాంతానికి కొత్త అయినా.. వాతావరణం, భూమి అనుకూలంగా ఉండడంతో మా పొలంలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెలకు ఉన్న డిమాండ్ చూస్తే ఆయిల్ పాం సాగు ఎంతో లాభసాటిగా మారుతుంది. మన దేశం ఏటా పామాయిల్ దిగుమతి చేసుకునేందుకు రూ.70 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం విదేశాలకు పోతోంది. మనమే సాగుచేస్తే దేశానికి ఎంతో ప్రయోజనం. ఏటా పామాయిల్ ధర పెరుగుతున్నందున రైతులు వెంటనే ఈ పంటకు మారాలి.
అన్ని విధాలా సహకారం..
ప్రపంచవ్యాప్తంగా వంట నూనెలకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఏర్పడింది. మనం విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకున్నా.. దేశంలో కొరత వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీగా ప్రోత్సాహకాలు అందించి ఆయిల్ పాం సాగును పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రస్తుతం మూడు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నాం. జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఆయిల్ ఫెడ్ పరిధిలో, మిగతా మూడు జిల్లాలు ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలో ఉన్నాయి. రైతులకు సబ్సిడీలు అందించడం మొదలు మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు, పంట విక్రయాల వరకు అండగా ఉంటాం. ఆయిల్పాం సాగుతో పాటు అంతర పంటల ద్వారా రైతులు సరైన యాజమాన్య చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.3 లక్షల వరకు సంపాదించొచ్చు. ఆసక్తి ఉన్న రైతులు సమీప ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి ఆయిల్ పాం సాగు చేపట్టొచ్చు.