మక్తల్ టౌన్, ఏప్రిల్ 2: కరోనా వ్యాక్సిన్ను 45ఏండ్లు పైబడిన వారికి వేస్తున్నామని హెచ్ఈవో లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేశారు. ఇప్పటివరకు 1215 మంది మెడికల్ సిబ్బంది, పోలీస్, అంగన్ వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, మున్సిపాలిటీ సిబ్బంది టీకా వేసుకున్నారని తెలిపారు. జనవరి 15నుంచి టీకా వేస్తున్నామన్నారు. టీకా వేసుకున్న వారు మొదటి డోస్కు, రెండో డోస్ మధ్య నెలరోజుల సమయం ఉండాలన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు టీకా వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సిద్దప్ప, పార్వతి, సురేశ్, తిరుపతి, హెచ్ఈవో లక్ష్మీనారాయణ, కర్ని, మక్తల్ ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దామరగిద్ద పీహెచ్సీలో..
దామరగిద్ద, ఏప్రిల్ 2: మండల కేంద్రంలోని పీహెచ్సీలో కొవిడ్ టీకా కేంద్రాన్ని డాక్టర్ రవీందర్ ప్రారంభించారు. 45 సంవత్సరాలు దాటిన వారు ఆధార్ కార్డుతో వస్తే టీకా వేస్తామని ఆయన తెలిపారు. టీకా వేసుకున్నా మాస్కు తప్పకుండా ధరించాలి, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో దవాఖానా సిబ్బంది వెంకట్రామారెడ్డి పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, ఏప్రిల్ 2: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కొవిడ్ టీకాలు వేశారు. మాజీ వైస్ ఎంపీపీ రాంచంద్రయ్య, ఎంపీటీసీలు ఉమేశ్కుమార్, గోవర్ధన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మల్లయ్య టీకా వేసుకున్నారు. టీకా వేసుకున్న వారికి డాక్టర్ వెంకట్దాస్ జాగ్రత్తలను సూచించారు.