24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తాం
రాష్ట్ర మహిళా ఆర్గనైజర్ కమరున్నీసాబేగం
హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 6: బొడిగె శోభ అనుచిత వ్యాఖ్యలు వెంటనే మానుకోవాలని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, రాష్ట్ర మహిళా ఆర్గనైజర్ కమరున్నీసాబేగం హెచ్చరించారు. మంగళవారం హన్మకొండ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత నీకు లేదు. తెలంగాణ ఉద్యమంలో నీతో సమానంగా మేము కూడా పాల్గొన్నాం’ అని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, దమ్ముంటే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని బొడిగె శోభకు సవాల్ విసిరారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే శోభ ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో వరంగల్ కల్చరల్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఎడవెల్లి విజయ, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఉపేంద్ర, నాయకురాలు జయశ్రీ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నా!
భార్యను కొట్టాననే మనస్థాపంతో భర్త ఆత్మహత్య