హైదరాబాద్ : భార్యను అకారణంగా కొట్టానని మనస్థాపానికి గురైన భర్త అత్యహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రహ్మత్నగర్ ఎస్పీఆర్ హిల్స్లోని రాజీవ్గాంధీ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న ఎండీ.ఖదీర్(35) సోఫామేకర్గా పనిచేస్తుంటాడు.
సోమవారం రాత్రి 10.30 ప్రాంతంలో పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఖదీర్తో భార్య సానియాబేగంతో గొడవ పడింది. రోజూ మద్యం సేవించి వస్తే ఎలా అంటూ ప్రశ్నించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఖదీర్ అమెను కాపర్ వైర్తో చితకబాదాడు.
దాంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అకారణంగా నిన్ను కొట్టానంటూ మనస్థాపానికి గురైన ఖదీర్ గ్యాస్ సిలిండర్లో రెగ్యులేటర్ ఇప్పి నిప్పంటించేందుకు యత్నించాడు. అడ్డుకున్న సానియా గ్యాస్ సిలిండర్ను తీసుకు వెళ్లి పక్కింట్లో పెట్టేందుకు వెళ్లింది.
ఈలోగా ఇంట్లో ఉన్న టర్పెంటాయిల్ను వంటిమీద పోసుకున్న ఖదీర్ నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలవ్వగా స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న ఖదీర్ మంగళవారం మద్యాహ్నం 12.30కి మృతి చెందాడు.
మృతుడి సోదరుడు మహ్మద్ అజీజ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్తో డయాబెటిస్కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!