వనపర్తి, అక్టోబర్ 7 : తన కుటుంబం బాగుంటే చాలు.. పక్కవాడికి ఏమైతే ఏంటి అనుకుంటున్న సమాజంలో ఎవరికీ సాయం చేయాలన్న ఆలోచన విస్మరిస్తున్నారు. రూపాయి సా యం చేసి రూ.వంద పబ్లిసిటీ కోరుకునే రోజుల్లో కూడా ఎంతో మందికి ఇటు సాయం చేస్తూ నే.. అటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారిని అరుదుగా చూస్తుంటాం. ఎన్నో కష్టనష్టాలను చవి చూసి.. స్వశక్తితో ఉన్నత స్థానానికి ఎదిగి పది మందికి ఉపాధి కల్పించాల ని వనపర్తికి చెందిన తిరుమల మహేశ్ పరితపిస్తుంటాడు. ఉన్న దానిలో తన వంతుగా సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచనల నుంచి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016లో వనపర్తి జి ల్లా కేంద్రానికి చెందిన తిరుమల సరస్వతి డెవలపర్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల మహేశ్ ప్రా రంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆలయాల అభివృద్ధికి, పేదింటి ఆడబిడ్డలకు పుస్తె, మెట్టెలు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇద్దరు విద్యార్థుల చదువుకు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం, పేదలకు వైద్య శిబిరాలు, వృద్ధ్దాశ్రమంలో ఆహారం, దుప్పట్లు, కనీస సౌకర్యాల కల్పన వంటివి చేపడుతున్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలు..
సాయం చేయడంలోనే ఆనందం..
పక్కవాడికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటా. ప్రజలకు నా వంతుగా సేవ చేయాలన్న లక్ష్యంతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశాను. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలు, ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నా. నేరరహిత సమాజం కోసం పోలీసులు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా తన వంతుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాను.