ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నుంచి రక్షించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. వైద్య సిబ్బంది వాడవాడలా డ్రవ్లు నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నారు.
హఫీజ్పేట్లో…
కొవిడ్ మహమ్మారినుంచి రక్షించుకొనేందుకు ప్రతిఒక్కరు టీకా వేసుకోవాలని కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియఫేజ్2లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా ప్రక్రియను స్ధానికులతోకలిసి ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ మాట్లాడుతూ..వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే లక్ష్యంతో యూపీహెచ్సీ, బస్తీదవఖాన, ఇతరాత్రాకేంద్రాలతోపాటు మొబైల్కేంద్రాలద్వారా అందుబాటులోకి తెచ్చిన టీకా సౌలభ్యాన్ని ప్రజలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూపీహెచ్సీ డా. వినయ్బాబు, నల్లాసంజీవరెడ్డి, బాల్లింగ్ యాదగిరిగౌడ్, జనప్రియనగర్1,2 అధ్యక్షులు శాంతయ్య, జితేందర్రెడ్డి, కృష్ణముదిరాజ్, కిష్టన్న, అశోక్, కొండల్రెడ్డి, వాసుదేవరావు తదితరులు పాల్గోన్నారు.
మైలార్దేవ్పల్లిలో….
కరోనా టీకాలు తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని మైలార్దేవ్పల్లి డివిజన్ సీనియర్ నాయకులు కాశిగారి యాదగిరి అన్నారు. శుక్రవారం పద్మశాలిపురంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు మూడవ రోజు ప్రజల నుండి విశేష స్పందన లబించింది. కోవిషిల్డ్ మొదటి డోస్ తీసుకోవడానికి ప్రజలు బారులు తీరారు.ఈ సంధర్బంగా కాశిగారి యాదగిరి మాట్లాడుతూ..బస్తీలో ఉన్న ప్రజలందరికీ కరోనా పట్ల అవగాహన కల్పించడంతో ప్రజలు ముందుకు వచ్చి టీకాలు తీసుకుంటున్నారని అన్నారు. గత మూడు రోజుల నుండి కరోనా టీకాలు ఇస్తున్నప్పటికి ప్రజల రద్ది తగ్గడంలేదని అన్నారు. అధికారులు గుర్తించి మొబైల్ వ్యాక్సినేషన్ను మరో రోజు పొడిగిస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం 334 మందికి వ్యాక్సినేషన్ చేశామని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు యంజాల మహేష్రాజ్ ,యంజాల శేఖర్ ,సంగిశసెట్టి రవి,గంజి వెంకటేశ్ ,టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.