అమీర్పేట్:శ్రావణమాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నవిశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన చేశారు. విభిన్న రకాల, విభిన్న రంగుల పూలతో అమ్మవారిని అలంకరించారు. అలాగే అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించారు. అమ్మవారి అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రావణమాసం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు.