అమీర్పేట్ : సనత్నగర్లోని కేఎల్ఎన్ పార్కును మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. పార్కు సందర్శకుల ఉత్సాహాన్ని పెంచే విధంగా ఇక్కడి కుంటలో సైక్లింగ్ బోటు, చక్కటి రంగులతో ఫౌంటేన్లను ఏర్పాటు చేయాలన్నారు.
సోమవారం పార్కు ఆవరణలో రూ. 90వేల వ్యయంతో కొత్తగా చేపడుతున్న మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు ఆవరణలో మరిన్ని మెరుగైన సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
పార్కు సుందరీకరణ చర్యల్లో భాగంగా కుంటలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించి స్వచ్ఛమైన నీటితో నిండేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా పార్కులో శిధిలామైన టాయ్లెట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలతో పాటు జీహెచ్ఎంసీ యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ మోహన్, పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు షాబాద్ శ్రీనివాసరావు, వై.ప్రభాకర్రెడ్డి టీఆర్ఎస్ నాయకులు సురేష్, కొలను బాల్రెడ్డి, రాజేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు త్వరలో ..
ప్రజలకు మరింత మెరుగైన వైద్యం కోసం నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టబోతోం దని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల వైద్యశాలకు చెందిన విశాలమైన స్థలంతో పాటు అనేక ఇతర ప్రదేశాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాల కోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు.
ఇప్పటికే బస్తీ దవాఖానాల ఏర్పాటుతో నగర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం జరిగింద న్నారు. సర్దార్ మన్మిత్సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమీర్పేట్ గురుద్వారా సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిభిరాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ శిబిరంలో దాదాపు 300 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకుని మందులను ఉచితంగా పొందారని నిర్వాహ కులు సర్దార్ కుల్వంత్సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, సామాజిక సేవకులు కొత్తపల్లి మధుసూధన్రావు తదితరులు పాల్గొన్నారు.