రైతుల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
నియోజకవర్గవ్యాప్తంగా రహదారుల నిర్మాణం
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
తల్లాడ, ఏప్రిల్ 4: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.108 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఆదివారం ఆయన తల్లాడ మండలంలోని 15 గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. కుర్నవల్లిలో సర్పంచ్ అయిలూరి లక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. రహదారులకు ఆర్అండ్బీ నుంచి రూ.22 కోట్లు, పంచాయతీరాజ్ నుంచి రూ.24 కోట్లు, సింగరేణి నుంచి రూ.32 కోట్లు, సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ.34 కోట్లు మంజూరయ్యాయన్నారు. కుర్నవల్లి- ఉమ్మడదేవరపల్లి అంతర్రాష్ట్ర రహదారికి రూ.6 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం నూతనకల్లో గాయపడిన ఉప సర్పంచ్ తీకు సీతారాములు ఇంటికి వెళ్లి స్వయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించి ఆత్మైస్థెర్యాన్ని ఇచ్చారు. ఇలా 15 గ్రామాల్లో అనారోగ్య బారిన పడిన 74 మంది బాధిత లబ్ధిదారులకు రూ.39,14,250 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్వయంగా అందజేశారు. 32 మంది లబ్ధిదారులకు రూ.33,03,828 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలతో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసివేసినప్పటికీ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సివిల్ సైప్లె కార్పొరేషన్కు రూ.29 వేల కోట్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, నీలాద్రి దేవాలయ డైరెక్టర్ పెరిక నాగేశ్వరరావు, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, సర్పంచ్లు శీలం కోటారెడ్డి, తూము శ్రీనివాసరావు, నారపోగు వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ కిరణ్, చింతల రేణుక, సూరంపల్లి లక్ష్మీనారాయణ, బాణోతు మోహన్, ఆదూరి వెంకటేశ్వర్లు, మువ్వా మురళీ, కేతినేని చలపతి, అన్నెం కోటారెడ్డి, నల్లబోతు రామారావు, దిరిశాల దాసురావు, కట్టా రాము, ఓబుల సీతారామిరెడ్డి, నాయుడు శ్రీను, వజ్రాల రామిరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
భద్రతాబలగాల బలిదానాలు వృథా కాబోవు: ఛత్తీస్గఢ్ సీఎం
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ