గద్వాల న్యూటౌన్, జనవరి 14 : శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసులు అక్రమార్జనకు అ లవాటుపడి పక్కదారి పడుతున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ వర్గాల మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో పోలీసులు పా వులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతున్న ది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉన్నా.. స్వతంత్రంగా పనిచేయాల్సిన పోలీసులు వారికి అనుకూలంగా ఉన్న వర్గాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ వివాదాల్లో చిక్కుంటున్నారని తెలుస్తున్నది. అక్రమార్కులతో బేరసారాలు సా గించి శాఖకే మచ్చ తెస్తున్నారు. సెటిల్మెంట్లు, పీడీఎస్ బియ్యం, మట్టి తరలింపు, నకిలీ విత్తనాలు, ఇసుక, క్రికెట్ బెట్టింగ్, కాల్మనీ ముఠా వంటి అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న జి ల్లాలో కొందరు పోలీసులు అక్రమార్కులతో కు మ్మక్కైన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఓ ఏఎస్సై సంతకా న్ని ఫోర్జరీ చేసిన ఘటనలో సీఐ హన్మంతు సస్పెస్షన్కు గురికాగా.. తా జాగా గట్టు ఎస్సై మంజునాథ్ రెడ్డి రూ.50 వే లు డిమాండ్ చేస్తూ మధ్యవర్తితో ఫో న్లో మా ట్లాడిన సంభాషణ వైరల్గా మారింది. దీంతో సీఐ షేక్ మహబూబ్ బాషా గట్టు పీఎస్కు వెళ్లి విచారణ చేపట్టారు. ఇలా తరుచూ ఖాకీలు వి వాదాల్లో చిక్కుకుంటున్నారు.
అత్యుత్సాహం.. నిర్లక్ష్య వైఖరి..
జిల్లాలోని మూడు సర్కిళ్లలో పోలీసులు రా జకీయ నాయకులకు పూర్తిస్ధ్థాయిలో సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసుల్లో పక్కాగా వ్యవహరించాల్సిన పోలీసులు అత్సుత్సాహం చూపుతున్నారు. ఆర్థికంగా స్థిరపడాలన్న అత్యాశ, రాజకీయ నాయకుల కన్నుసన్నల్లో ఉంటే బాగుంటుందన్న ఆలోచనలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నాయకుల ఒ త్తిళ్లతో వివిధ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏకంగా ఉద్యోగాలకే ఎసరు పడుతున్నది. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు చూ స్తే పోలీసులు ఎంత అవినీతిలో కూరుకుపోయారో అర్థమవుతున్నది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. గద్వాల మండలంలోని జమ్మిచేడులో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం లో అప్పటి రూరల్ ఎస్సై ఒకే వర్గానికి అనుకూలంగా వ్యవహరించి మరో వర్గం వారికి కొట్టారని దళిత సంఘాల నాయకులు ఆందోళన చేయడంతో సదరు ఎస్సైని ఎస్పీ రంజన్ రతన్కుమా ర్ బాధ్యతల నుంచి తప్పించారు. వడ్డేపల్లి మం డలం శాంతినగర్లో ఒక యువకుడిని ఎస్సై లెనిన్ బూటు కాలితో తన్నిన విషయం వైరల్ కావడంతో ఎస్సైని వీఆర్కు అటాచ్ చేశారు. గతేడాది నకిలీ వే బిల్లులతో అక్రమంగా ఇ సుక రవాణా విషయంలో మాఫియాకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు ఎస్సైలను వీఆర్ కు అటాచ్ చేశారు. అలాగే ల్యాండ్ సెటిల్మెంట్లలో పోలీసుల జోక్యంపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు పురుగుల మందు డబ్బాలతో ఎస్పీ కార్యాలయం ఎ దుట నిరసన చేశారు. గద్వాల, అయిజ, శాంతినగర్, రాజోళి, మల్దకల్, ఇటిక్యాల మండలా ల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా, గట్టు జాతరలో కాయ్ రాజా కాయ్ ఆట నిర్వహించడానికి ఇసుక వ్యాపారి తరఫున అనుమతిచ్చేందుకు రూ.50 వేలు కావాలని మధ్యవర్తితో ఎస్సై మంజునాథ్రెడ్డి జరిపిన ఫో న్కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై సీఐ షేక్ మహ బూబ్ బాషా విచారణ చేపట్టారు. ఇలా భూ దందాలు, సెటిల్మెంట్లు, ఇసుక వ్యాపారుల తో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ శాఖకే తలవంపులు తెస్తున్నారు.
సహించేది లేదు : సీఐ బాషా
పోలీస్శాఖ అంటే క్రమశిక్షణ మారుపేరు. అందరికీ ఆదర్శంగా ఉంటూ సమాజానికి దిశానిర్ధేశం చేసే గొప్ప స్థానం. నిబంధనలను ఉల్లంఘిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై శా ఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. గట్టు ఎ స్సై ఫోన్ కాల్ సంభాషణపై పూర్తి విచారణ చేపట్టాం. ప్రస్తుతం ఆ ఎస్సైని వీఆర్కు అటాచ్ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదు.
గట్టు ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు..
గట్టు, జవనరి 14 : అవినీతి ఆరోపణలు ఎ దుర్కొంటున్న గట్టు ఎస్సై మంజునాథ్రెడ్డిపై క్ర మశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్సైను వీఆర్ (వేకెన్సి రిజర్వ్)లో ఉంచుతూ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సీఐ బాషా శుక్రవా రం తెలిపారు. ఇదిలా ఉండగా గట్టు పీఎస్లో పలువురు కానిస్టేబుళ్లపై కూ డా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇసుక, మట్టి, జూదం వంటి అక్రమ వ్యవహారాల్లో కొందరి పాత్ర ఉందని విచారణలో తేలినట్లు సమాచారం.