కవాడిగూడ: సీఎం కేసీఆర్ న్యాయవాదులకు న్యాయం చేశారని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పాటిల్లు బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయవాదులు వారిని పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులిగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యమంలో పనిచేసిన వారిని గుర్తించి న్యాయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కొంతం గోవర్ధన్ రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.