కొత్తపల్లి, మే 15 : తెలంగాణ వీరవనిత, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకుసాగాలని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. చింతకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐలమ్మ మహిళల్లో చైతన్యం రగిల్చి, కూలీలు, రైతుల్ని ఏకతాటిపై తీసుకువచ్చిన మహా యోధురాలు అని కొనియాడారు.
చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమె వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. అనంతరం గ్రామంలో రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో రూ. 10 లక్షలతో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్, మరుగుదొడ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.అనంతరం శ్రీ రామాంజనేయ శివ సాయి ఆలయంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేశారు. గౌడ, రజక కులస్తుల కమ్యూనిటీ భవన నిర్మాణాలకు ఒక్కొక్క దానికి రూ. 10 లక్షల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర మేయర్ వై సునీల్రావు, ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్గౌడ్, సర్పంచ్ మొగిలి మంజుల సమ్మయ్య, ఎంపీటీసీ, సుడా డైరెక్టర్ భూక్యా తిరుపతినాయక్, పట్టెం శారద లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలి మండలంలోని బద్దిపల్లి గ్రామంలోని గురడ పర్వతంపై వెలిసిన స్వయం భూ శ్రీ అలివేలు మంగ లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి గంగుల కమలాకర్కు ఆలయ కమిటీ తరపున ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో మూడు రోజుల పాటు బ్రహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రికి తెలిపారు. అనంతరం మంత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి, ప్రజాప్రతినిధులు రాచమల్ల మధు, శ్రీనివాస్, పీ నరేందర్రెడ్డి, ఆర్ రవి, టీ నరేశ్, టీ పరశురాం, టీ ప్రభాకర్, రమేశ్, మహేశ్, రాజశేఖర్, నాగరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.