రామచంద్రాపురం, సెప్టెంబర్ 22: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని రాయసముద్రం చెరువులో రూ.72 వేలు విలువ చేసే 36వేల చేపపిల్లలను ఆయన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్తో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలను వదులుతుందని తెలిపారు. మిషన్కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్తో చెరువులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులతో పాటు అన్ని కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాయసముద్రం చెరువు వద్ద ఉన్న నాగులమ్మ ఆలయం సమీపంలో లింగమయ్య ఆలయ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పరమేశ్, నాయకులు ఆదర్శ్రెడ్డి, కుమార్గౌడ్, మోహన్రెడ్డి, గోవింద్, ప్రమోద్గౌడ్, ఐలేశ్, మల్లేశ్, బేకు యాదయ్య తదితరులున్నారు.
జిన్నారం రాయుని చెరువులో 3.48 లక్షల చేప పిల్లలు విడుదల
జిన్నారం, సెప్టెంబర్ 22: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం జిన్నారంలోని రాయుని చెరువులో రూ.6.96 లక్షల విలువైన 3.48లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్గౌడ్, విజయ్కుమార్, ఉపసర్పంచ్ సంజీవ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్, ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు, నరేందర్, మత్స్య సహకార సంఘం నాయకులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మత్స్య సంపద అభివృద్ధికి కృషి
అమీన్పూర్, సెప్టెంబర్ 22: మత్స్య సంపద అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువులో బుధవారం ఆయన మూడు లక్షల పన్నెండు వేల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో చేప పిల్లలను వదులుతున్నారని చెప్పారు. మత్య్యకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, వార్డు కౌన్సిలర్లు కృష్ణ, కో-ఆప్షన్ సభ్యులు తలారి రాములు, యూనుస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.