కొండాపూర్ : శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని బుధవారం చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉభయ దేవేరులతో స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు సాయి ఆధ్వర్యంలో స్వామి కళ్యాణంతో పాటు శాంతి హోమాలను ఘనంగా నిర్వహించారు. పూజల అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదములను అందజేశారు. ప్రత్యేక పూజల్లో ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు.