ముషీరాబాద్ : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎ కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
బుధవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 135 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులను) అందచేశారు.
అనంతరం ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాల ద్వారా ఒక లక్షా నూటపదహారు రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎ కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్.సుప్రియా నవీన్ గౌడ్, రచనశ్రీ, పావని, ముషీరాబాద్, హిమాయత్నగర్ తహసిల్దార్లు జానకి, లలిత తదితరులు పాల్గొన్నారు.