దమ్మపేట, జనవరి 19: నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 16 మంది లబ్ధ్దిదారులకు రూ.16లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాల్లో యువతులకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలంటే పడుతున్న బాధలను చూసి ఆయన మదిలో మెదిలిన పథకమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రంగాప్రసాద్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఉపసర్పంచ్ దారా యుగందర్, కోఆప్షన్ సభ్యుడు బుడే, యువజన విభాగం మండల అధ్యక్షుడు చామర్తి గోపి, పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, శ్రీను, అబ్దుల్ జిన్నా పాల్గొన్నారు.