Ashtalakshmi
ఆర్కేపురం : కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారిని శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్సీ కవిత వెంట సీఎం కేసీఆర్ సతీమణి శోభ, వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉన్నారు.
ఇంకా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోల్లేటి దామోదర్గుప్త, టిఎస్ఐడిసి చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణగుప్త, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, దేవి ప్రసాద్, రామ్మోహన్గౌడ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.