హన్మకొండ సిటీ, ఏప్రిల్ 7 : చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాటరీ కారును రూపొందించినట్లు రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు. డాక్టర్ ముకులోత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధ్యాపకులు పెట్రోల్ ఇంజిన్ కారును బ్యాటరీతో నడిచేలా తయారు చేశారన్నారు. గేర్బాక్స్, ఇంజిన్ను తొలగించి 48 వోల్ట్స్, 700 వాట్స్, 500 ఆర్పీఎం కలిగిన మోటరును మారుతి కారు ఇంజిన్ భాగంలో అమర్చి మోటర్ను చైన్ డ్రైవ్ ద్వారా అనుసంధానించార న్నారు. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో గేర్బాక్స్ ఉన్న ఇంజిన్, పెట్రోల్ వాహన చార్జీలపై డబ్బులు ఆదా చేయడానికి ఈ పరిశోధన చాలా ఉపయోగపడుతుందన్నారు. రూ. 2 లక్షల ఖర్చుతో కారును మార్చిడి చేసుకోవచ్చని, కిలోమీటరుకు 20 పైసల ఖర్చుతో 60 కిలోమీటర్ల వేగంతో కారు నడుస్తుందన్నారు. పేటెంట్ కోసం చైతన్య యూనివర్సిటీ దరఖాస్తు చేసుకుంటుందని, ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్లో ఇటువంటి వాహనాలకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.
‘గ్రేటర్ ఎలక్షన్స్’ ప్రత్యేకాధికారిగా పంకజ
వరంగల్, ఏప్రిల్ 7 : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకాధికారిగా గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ పంకజను డిప్యూటేషన్పై నియమించారు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంకజ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు పరిశీలించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమె వరంగల్లోనే ఉంటారని, తగిన వసతులు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారం..!
తృణమూల్ నుంచి బెంగాల్కు విముక్తి : యోగి ఆదిత్యానాథ్