లక్నో: అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని ఇటుక బట్టీల్లో కూలీపని చేసుకునే దంపతులకు ఐదేండ్ల కూతురు ఉన్నది. ఎప్పటిలాగే బుధవారం కూడా బాధితురాలి తల్లిదండ్రులిద్దరూ ఇటుక బట్టీల్లో పనిచేస్తుండగా నిందితుడు బాలికను బయటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తీవ్ర గాయాలతో ఏడుస్తూ వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దాంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.