గోల్నాక : సర్వమత సమానత్వమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్ సీపీఎల్ చర్చిలో ఏర్పాటు చేసిన కార్య క్రమానికి స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన హాజరై..కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు.
అనంతరం పేద కైస్తవ కుటుంబాలకు దుస్తులతో కూడిన కానుకలను అందజేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అన్ని మతాలకు చెందిన పర్వ దినాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి మతపెద్ద రాజు, టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగారావు, సతీష్, జాకీబాబు, మహేష్ముదిరాజ్, లవంగు నాగరాజు, నాగరాజు, సంతోష్చారి తదితరులు పాల్గొన్నారు.