బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట్ డివిజన్లోని గైదిన్బాగ్లో పునర్నిర్మించిన శ్రీ రేణక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన గావించారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్. ఈ క్రమంలో ఆలయంలో మంత్రి తలసాని ప్రత్యేక పూజలు చేశారు.
అంతకు ముందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, కిషోర్కుమార్, కిరణ్మయి, ఆలయాల నిర్వాహాకులు దానయ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.