మాక్లూర్, జనవరి 17 : కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ఎంపీపీ మాస్త ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెంచిన ఎరువుల ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో పాటు ఎరువుల ధరలను విపరీతంగా పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శంకర్గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు సుక్కి సుధాకర్, భోజన్న, రమేశ్, అమృత్, గంగాధర్, శశి, సురేశ్, లక్ష్మణ్, సర్పంచులు మల్లారెడ్డి, ప్రవీణ్, చిన్నారెడ్డి, డైరెక్టర్లు అశోక్, గంగాధర్, శేఖర్, మోహన్ పాల్గొన్నారు.