బండ్లగూడ 5ః రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు జెండాను అవిష్కరించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా స్థానిక నాయకులతో కలిసి జెండాను అవిష్కరించారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మహేందర్గౌడ్,కమిషనర్ వేణుగోపాల్రెడ్డి,డిప్యూటి మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి స్థానిక ప్రజా ప్రతి నిదులతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లోపాల్గొని జెండాను అవిష్కరించారు. అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, సులేమాన్ నగర్, శాస్త్రీపురం, కిస్మత్పూర్, బండ్లగూడ, హైదర్షాకోట్, హిమాయత్సాగర్, పిరం చెరువు తదితర ప్రాంతాలల్లో స్థానిక నాయకులు జెండాను అవిష్కరించారు.