బేగంపేట : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవాలయం ఈవో గుత్తా మనోహార్రెడ్డి, వేద పండితులు, దేవాలయం ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ కామేశ్, దేవాలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.