ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం 2022 క్యాలెండర్ను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమె నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహంతో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి నూతన సంవత్సరంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, ఆయల చైర్మన్ జగిని రమేష్గుప్త, ఈవో రవీందర్రెడ్డి, నాయకులు న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, సాజీద్, తాడేపల్లి వెంకటేశంగుప్త, రవీందర్రెడ్డి, మురళీధర్రెడ్డి, శ్యామ్గుప్త, పొద్దుటూరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.