తల్లాడ, జనవరి16 : సీఎం కేసీఆర్ సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడ సొసైటీ కార్యాలయంలో టీఆర్ఎస్ యువజన విభాగం రూపొందించిన క్యాలెండర్ను డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, నాయకులు కృషిని కొనసాగించాలని సూచించారు. యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని ఆయన కోరారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల మార్పిడి , ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. రానున్న రోజుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండే ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రజలు నిబంధనలు పాటించాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతపై ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, అయిలూరి ప్రదీప్రెడ్డి, శీలం కోటారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఓబుల సీతారామిరెడ్డి, జొన్నలగడ్డ కిరణ్, కోడూరి వీరకృష్ణ, దిరిశాల దాసురావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బద్ధం కోటిరెడ్డి, డీ.వీ.ఆర్, పెరిక నాగేశ్వరరావు, నాయకులు వజ్రాల రామిరెడ్డి, కాంపాటి జమలయ్య, గుండ్ల నాగయ్య, సరికొండ కస్తూరిరాజు, కాంపాటి శశికుమార్, మాగంటి శ్రీను, పమ్మి కృష్ణారావు, దూపాటి నరేశ్రాజు తదితరులు పాల్గొన్నారు.