చార్మినార్ : ప్రజలకు మరింత మెరుగైన చికిత్సలు అందించేందుకు స్థానిక ప్రాంతాల్లోనే ప్రజల చెంతకు బస్తీ దవఖానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర హోశాఖ మంత్రి మహమూద్అలీ తెలిపారు. శుక్రవారం ఆయన చార్మినార్ నియోజకవర్గంలోని పురానాపూల్ డివిజన్ కసరట్టాలో బస్తీ ధవఖానాను ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్అలీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మెరుగైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగానే స్థానిక ప్రాంతాల్లో బస్తీ ధవఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
బస్తీ ధవఖానాల్లో స్పెషలైజేషన్ చికిత్సలైన మధుమేహవ్యాధి, కార్డియాలజీ, యురాలజీ, నెఫ్రలజీ, అప్తామాలజీ, డెంటల్ తదితర వ్యాధులకు సైతం చికిత్సలు లభిస్తున్నామని తెలిపారు.
కోవిడ్ సంచార వాహనం
కసరట్టాలోని బస్తీ ధవఖానా ఆవరణలోనే కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ సైతం కొనసాగనుందని డిస్ట్రిక్ ఇమ్యూనోలజీ ఇంచార్జ్ డాక్టర్ల శ్రీకళ తెలిపారు. స్థానికంగా నివసించే ప్రజలందరూ కొవిడ్ నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ పొందాలని సూచించారు.
కసరట్టాలోని బస్తీ ధవఖానా ఆధ్వర్యంలో రెండు మొబైల్ వ్యాక్సిన్ సంచార వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్తీ దవఖానాలకు వచ్చేవారిలో అర్హులను గుర్తిస్తూ వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందజేస్తామని తెలిపారు. అదే సమయంలో సంచార వాహనాల ద్వార సమీప ప్రాంతాల్లోని ప్రజలకు కొవిడ్పై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకువచ్చి వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్తోపాటు పురాణపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజ్మోహన్, టిఆర్ఎస్ హైద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ పుస్తె శ్రీకాంత్, పుప్పాల రాధకృష్ణ, గోపినాధ్ యాదవ్, గోపిగౌడ్, గుంటి మంజుల,ఎస్.సిహెచ్ఓ డాక్టర్ సునంద, సెంటర్ ఇంచార్జ్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్లు ఫిర్దోస్ ఫాతిమా, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.