రామవరం, చుంచుపల్లి, కొత్తగూడెం అర్బన్, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ రూరల్, పాల్వంచ, జూలూరుపాడు, జనవరి 21 : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని వైద్యశాఖ అధికారులు కొత్తగూడెం నియోజకవర్గంలో తొలిరోజు శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం అర్బన్ ప్రైమరీ హెల్త్సెంటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పోటు వినోద్ పరిశీలించారు. వీజీఎస్టీ ఏరియా, నాగయ్యగడ్డ ఏరియాల్లో పర్యటించి ఆర్టీఏ టెస్టులు చేస్తున్న ప్రాంతాలను పర్యవేక్షించారు. సర్వే చేస్తున్న ఏఎన్ఎంలు, మెప్మా ఆర్పీ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారికి సలహాలు చెప్పి మెడికల్ కిట్లను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్కుమార్, వార్డు కౌన్సిలర్ మోరె రూప, యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సంజీవరావు, పీహెచ్ఎం శ్రీనివాసరావు, మెప్మా టీఎంసీ నాగయ్య, మోరె రమేశ్, భాస్కర్, రాజేశ్వరి, పద్మ, కవిత పాల్గొన్నారు.
చుంచుపల్లి మండలంలో సర్వేను ఎంపీడీవో సకినాల రమేశ్ ప్రారంభించారు. ప్రతి పంచాయతీలో 100 ఇండ్ల వరకు సర్వే పూర్తి చేసి వివరాలను నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఎంపీవో గుంటి సత్యనారాయణ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. బదావత్తండా ఎన్కేనగర్, బాబూక్యాంప్ పంచాయతీల్లో జరుగుతున్న సర్వేను ఎంపీపీ బాదావత్ శాంతి పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని, సిబ్బంది వారి సందేహాలను నివృత్తి చేయాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు లలిత, వెంకట్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీలోని మేదరబస్తీ 19వ వార్డు, 25వ వార్డులో కౌన్సిలర్లు బండి నర్సింహారావు, సాహెరా బేగం ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఇళ్లలో ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే కొవిడ్ మందుల కిట్లు అందజేశారు. ఆశా కార్యకర్త సుశీల, ఆర్పీ రాజకుమారి, ఓబీ సరోజ, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, సత్యవతి, ఆర్పీ రాధిక పాల్గొన్నారు. సుజాతనగర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో సర్వే చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్ కాలనీ పంచాయతీలో ఇంటింటి ఫీవర్ సర్వే ప్రారంభించారు. ఎంపీడీవో రామారావు, తహసీల్దార్ నాగరాజు పరిశీలించారు.
పాల్వంచ మండలంలోని జగన్నాధపురం, ఉల్వనూరు పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల సహకారంతో వైద్యసిబ్బంది సర్వే ప్రారంభించారు. పరీక్షలు జరిపి 220 హోం ఐసొలేషన్ కిట్లను అందజేశారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సర్వే ప్రారంభమైంది. కమిషనర్ చింతా శ్రీకాంత్ ఆయా వార్డుల్లో పర్యటించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. జూలూరుపాడు మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో వైద్య, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో జ్వర సర్వే నిర్వహించారు. జ్వరం లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేశారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రామారావు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.