రామాయంపేట, జనవరి 21: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజల్లో యాంటీబాడీస్ ఎంతవరకు ఉత్పత్తి అయ్యాయో తెలుసుకోడానికే ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నామని ఐసీఎంఆర్ వైద్య బృం దం డాక్టర్లు రాఘవేంద్ర, శ్రీనివాస్, స్టీఫెన్ అన్నా రు. శుక్రవారం రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గొల్పర్తిలో 40 కుటుంబాలపై ఆరోగ్య సర్వే చేపట్టారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించామని తెలిపారు. వారి వెంట డి.ధర్మారం వైద్యురాలు ఎలిజబెత్ రాణి, రామాయంపేట వైద్య సిబ్బంది, సూపర్వైజర్లు సత్తమ్మ, సునంద ఉన్నారు.
చేగుంట, నార్సింగి మండలాల్లో పర్యటన
చేగుంట, జనవరి 21: వ్యాక్సిన్ తీసకున్న యాంటీబాడీస్ అభివృద్ధిపై ఐసీఎంఆర్ డాక్టర్ సమరసింహ ఆధ్వర్యంలో వైద్య బృందం పరీక్షలు నిర్వహించి, వివరాలు నమోదు చేసుకుంది. శుక్రవారం మండల కేంద్రమైన నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాకేశ్తోపాటు, చేగుంట మండలం వల్భాపూర్లో బృందం సభ్యులు పర్యటించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పలువురికి యాంటీబాడీస్ పరీక్షలు నిర్వహించి, వివరాలు నమోదు చేసుకున్నారు. వారి వెంట టెక్నికల్ ఆఫీసర్ రుషికేశ్, పాండ్యా, ఏఎన్ఎంలు ఝాన్సీ, వైద్యులు రాకేశ్, అనిల్కుమార్, అలకనంద, ఏఎన్ఎంలు రేణుక, కవిత, రేఖ, సుగుణ, షమీమ్ సు ల్తానా, శాంత, రేణుక, ఆశమ్మ, పవిత్ర ఉన్నారు.
రక్త నమూనాలను సేకరణ..
నర్సాపూర్, జనవరి 21 : నర్సాపూర్ మున్సిపల్లోని 7వ వార్డు, రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఐసీఎంఆర్ టీం సందర్శించి, కొంతమంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ టీం లీడర్ డాక్టర్ పరస్ శర్మ మాట్లాడుతూ ప్రజల్లో యాంటీబాడీస్ ఎలా వ్యాప్తి చెందాయో తెలుసుకోడానికి రక్త నమూనాలను సేకరించినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో, వ్యాక్సిన్ తీసుకుని వారిలో యాంటీబాడీస్ ఎలా పనిచేస్తున్నాయో పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఈ సర్వే చేస్తున్నట్లు చెప్పారు. సాధారణ ప్రజలు, డీఎంహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో, వైద్య సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరి వెంట డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో విజయనిర్మల, మెడికల్ ఆఫీసర్ ప్రియదర్శిని ఉన్నారు.