శంషాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఆదుకోవడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
నర్కూడ గ్రామానికి చెందిన గుండాల పుష్పలత 43,500 రూపాయలు, ఎలగల సిద్ధులు 60.వేల రూపాయల చెక్కులను అందజేశామని వివరించారు. కార్పోరేట్ వైద్య శాలలో పేదలకు వైద్యమందించి వారికి ఆసరాగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
శంషాబాద్ : శంషాబాద్ కు చెందిన లబ్ధిదారు రఘు రాంరెడ్డికి శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. రూ.56 వేలు మంజూరు అయినవి. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్, వైస్ చైర్మన్ గోపాత్తో పాటు పలువురు పాల్గొన్నారు.