మియాపూర్ : ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ…వైద్య సేవలను వికేంద్రీకరిస్తూ విస్తృత పరుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నదని వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
శేరిలింగంపల్లి నియోజవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని హైదర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సంచార కరోనా టీకా వాహనాలను విప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్యం కోసం దూరం వెళ్లే శ్రమ లేకుండా ప్రజల ఆవాసాల నడుమనే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నదని, వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నదన్నారు.
బస్తీ దవాఖానాల్లో మరిన్ని మెరుగైన సేవలను ప్రజలకు అందివ్వాలని, తగిన వసతులను కల్పించాలని విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. నియోజకవర్గంలో మరిన్ని బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పక రెండు డోసుల టీకాను తీసుకోవాలని మరిన్ని సంచార వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చి టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని విప్ ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైద్య శాఖ జేడీ డాక్టర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమత, స్టాఫ్నర్స్ ప్రమీల, వైద్య సిబ్బంది రమాదేవి,జ్యోతి, మధులత,నందిని, లత, దశరథ్, ఈఈ గోవర్థన్, ఏఈ రాజీవ్, పార్టీ నేతలు దామోదర్రెడ్డి, ప్రసాద్, రాజేందర్, ఖదీర్, ఇబ్రహీం, సైదేశ్వర్,శ్రీనివాస్, కాశీనాథ్,బాలయ్య, అష్రాఫ్, సద్దాం,సత్తార్, కృష్ణకుమారి, లత, విమల, మాధవి,రేణుక, జుబేదా, పర్వీనా తదితరులు పాల్గొన్నారు.