చిక్కడపల్లి : సీఎం కేసీఆర్ పేదల పక్షత పాతి అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక బస్తీ వాసుల ఇండ్లు కుల్చకుండా నాలా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
దీంతో గురువారం మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ డివిజన్లోని అరుంధతి నగర్, సబర్మతినగర్, దోబీ ఘాట్ బస్తీలల్లో సంబరాలు నిర్వహించారు. సబర్మతినగర్లో జరిగిన కార్యక్రమంలోఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరైన పాటాకులు కాల్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా విస్తరణ ద్వారా నాలా పరీవాహక బస్తీలకు సంబంధించిన దాదాపు 500 ఇండ్లు నష్టపోవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. తన అభ్యర్ధనను విన్న మంత్రి కేటీఆర్ స్పందించి ఇండ్లు కూల్చకుండా నాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్..
కవాడిగూడ : హుస్సేన్సాగర్ నాలా పరివాహక ప్రాంతంలోని కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లలో గల దామోదరం సంజీవయ్యనగర్, మారుతీనగర్ బస్తీ వాసుల ఇండ్లకు ఎలాంటి హానిలేదని తెలపడంతో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నేతృత్వంలో భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కొత్తబ్రిడ్జి వద్ద సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఆయా బస్తీ వాసులు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్కు చొరవతో తమ ఇండ్లు తము దక్కాయని వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, అందరి కష్టనష్టాలు ఆయనకు తెలుసునని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్కు షాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని బస్తీవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, నాయకులు ముఠా నరేష్, దామోదరం సంజీవయ్యనగర్ బస్తీ అధ్యక్షుడు ఎరం నర్సింగరావు, భోలక్పూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.