హిమాయత్నగర్ : తమ కుమార్తె పూజ(19)కు మాయమాటలు చెప్పి పెండ్లి చేసుకున్న మైనర్ బాలుడిపై చర్యలు తీసుకుని తమ కుమార్తెను అప్పగించాలని బాధిత తల్లిదండ్రులు శారద,రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి చైర్మన్ రేణుకుంట్ల ఎల్లయ్యతో కలిసి వారు మాట్లాడారు.
మారేడ్పల్లిలో నివాసం ఉంటున్న తమ కుమార్తె పూజ 2021 అక్టోబర్ 3న సికింద్రాబాద్లో డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షలు రాసేందుకు వెళ్లింది.ఈ క్రమంలో బెల్లంపల్లికి చెందిన లోకేష్ కుమారుడు ( మైనర్ బాలుడు) గుర్తు తెలియని వ్యక్తులతో వచ్చి కిడ్నాప్ చేసి ఓ గుడి వద్ద దండలు మార్చుకుని పెండ్లి చేసుకున్నారని, చట్ట ప్రకారం చెల్లని పెండ్లి చేసుకుని అమాయకురాలైన తమ కుమార్తె చదువుకు అంతరాయం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రతి నిధులు అంజలీఖాదర్,సుభాషిణి, శ్యామ్ సుందర్, తిరుపతి, సంగీత రాజలింగం తదితరులు పాల్గొన్నారు.