సుల్తాన్బజార్ : ప్రపంచానికి శాంతిని, మతసామస్య సందేశాన్ని వ్యాప్తి చేసిన ఖాల్సాపంత్ వ్యవస్థాపకుడు పదవ,చివరి సిక్కు గురువు గురు గోవింద్ సింగ్జీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రకాష్ పురబ్ కార్యక్రమం ఆదివారంతో ముగిశాయి.
ఈ ముగింపు కార్యక్రమాన్ని గౌలిగూడలోని సెంట్రల్ గురుద్వారా గురు గ్రంథ్ సాహెబ్లో ప్రభంధక్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.కోవిడ్-19 నిబంధనలను అనుసరించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సిక్కు గురుద్వారాలలో గురు గ్రంధ్ సాహెబ్కి ప్రార్ధనలు చేశారు.
ఇందులో భాగంగా విశాల్ దీవాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సంధర్భంగా ప్రభంధక్ కమిటి అధ్యక్షుడు ఎస్ ఇందర్సింగ్, కార్యదర్శి జోగిందర్ సింగ్లు మాట్లాడుతూ సామూహిక సమ్మేళనంలో ప్రఖ్యాత రాగి జాఠాలు (సిక్కు భోధకులు), గుర్బాని కీర్తనలు, పవి త్ర శ్లోకాలు పఠించారు.
జలంధర్కు చెందిన మెహతాబ్ సింగ్జీ, బరేలీకి చెందిన మనోహర్ సింగ్తో పాటు దేశంలోని ఇతర ప్రముఖ రాగి జాఠాలు పాల్గొని భక్తి గీతాలను పఠించడంతో పాటు గుర్బాని ప్రభోధాలు చేశారు. జాతీయ సమైఖ్యత, శాంతి, సౌబ్రాతృత్వం, మత సామరస్యం కోసం నిలబడిన సిక్కు గురువులు భోధనలతో ప్రత్యేకంగా వెలుగునిచ్చారని అన్నారు.
ఈ సంధర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన సిక్కులకు గురు కా లంగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ప్రభంధక్ కమిటీ ఉపాధ్యక్షుడు హర్మీందర్ సింగ్తో పెద్ద ఎత్తున సిక్కు సోదరులు,మహిళలు పాల్గొన్నారు