వేల్పూర్, జనవరి 22: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆలయాలకు మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆయన స్వగృహంలో ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. భీమ్గల్ మండలంలోని బాచన్పల్లి కొండయ్య కోట హనుమాన్ గుడి నిర్మాణం కోసం రూ.24 లక్షలు, బడా భీమగల్లోని జగదాంబ దేవి, సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.12 లక్షలు, పాలెం కొమరవెల్లి మల్లన్న ఆలయానికి రూ.12లక్షలు, ముప్కాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.12 లక్షలు, అమీనాపూర్ అగ్గి మల్లన్న ఆలయానికి రూ.12లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నిధులను మంజూరు చేయించడంపై మంత్రికి ఆలయ కమిటీ బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మం డలాల టీఆర్ఎస్ అధ్యక్షులు దొన్కంటి నర్స య్య, బద్దం ప్రవీణ్రెడ్డి, ఏలియా, నాగధర్రెడ్డి, ఆర్టీఏ జిల్లా సభ్యుడు రాములు, ఎంపీపీలు మహేశ్, శివలింగు శ్రీనివాస్, జమున, జడ్పీటీసీలు భారతి, రవి, సర్పంచ్ సంజీవ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, ముప్కాల్ నా యకులు సామ వెంకట్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, డీలర్ రవి, శ్రీనివాస్, నరేందర్ నాయకులు కిషన్, మోహన్ పాల్గొన్నారు.