శ్రీశైలం, జనవరి 17 : శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా ఈవో లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పూష్పార్చనలు, శాస్ర్తోక్తంగా జరిగాయి. సోమవారం ఉభ య ఆలయాల్లో శ్రీభ్రమరాంబ, మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు విశేషార్చనలు, అభిషేకాలు నిర్వహించి పరివార దే వతామూర్తులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సా యంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీభ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చన, ఊయల సేవను నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాకారమంతా ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఊయలలో ఆ శీనులైన స్వామిఅమ్మవార్లకు అర్చక వేదపండితులు షోడశోపచార క్రతువులు జరిపి లలితా సహస్రనామ పఠనంతో కుంకుమార్చన చేశారు. అదేవిధంగా భ్రమరాంబాదేవి మ ల్లికార్జున స్వామిఅమ్మవార్లకి పల్లకీ సేవ ఘనంగా జరిగింది.
సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు రోజులపాటు నిత్యం శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం షోడశోపచార క్రతువులు చేసిన అనంతరం కార్యనిర్వాహణాధికారి లవన్న రుద్రహోమం, పూర్ణాహుతి, త్రిశూలస్నానం, మహదాశీర్వచన జరిపించారు. ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్ర్తోక్త అవభృతస్నానం చేయించి వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామిఅమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి ప్రాకారోత్సవం నిర్వహించిన తరువాత పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
చతుర్వేద పారాయణతో ఆధ్యాత్మిక శోభ
మానవ జీవనశైలికి పరమాధారమైనవి చతుర్వేదాలేనని.. ఓంకారం, శివ పంచాక్షరీ.. గాయత్రీ మంత్ర బీజాక్షరాలకు మూలాధారమైనవని ఆలయ వేదపండితుడు ఘం టి రాధాకృష్ణ అన్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా అ మ్మవారి ఆలయ ప్రాంగణంలో చతుర్వేదసభ, ఘనస్వస్థి కా ర్యక్రమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని ప్ర ధాన దేవాలయాల నుంచి వచ్చిన 24 మంది ఘనాపాటి సం స్కృత వేదపండితులు 9 మంది శ్రీశైల దేవస్థాన వేదపండితులచే 3 గంటలపాటు నిరంతరాయంగా సామవేదం, ఋగ్వేదం, అధర్వణవేదం, యజుర్వేద పఠనం చేశా రు. వేద పఠనానికి వచ్చిన పండితులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రంతోపాటు నూతన వస్ర్తాలు ఇచ్చి ఘనస్వస్తి నిర్వహించారని స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.