శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందరానగర్ దొడ్డి గ్రామంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన్నట్లు వైద్యాధికారి రమ్య తెలిపారు. ఇటీవల ఓ యువకుడు సౌదీ నుంచి రావడంతో అతడికి ఒమిక్రాన్ సోకింది.
దీంతో అతడికి దగ్గరగా ఉన్న 40 మందికి పరీక్షలు చేయగా అందులో నలుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వివరించారు. వారికి కిట్లు అందజేసి ఐసోలేషన్లో ఉంచినట్టు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.