ముషీరాబాద్: అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, శివముదిరాజ్, మాధవ్, నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, నాగులు యాదవ్, ఆలయ కమిటీ ప్రతినిధులు నర్సింగ్రావు, అశోక్, నారాయణ, కనకయ్య, శంకర్, నందు, వినోద్, శ్రీకాంత్లు పాల్గొన్నారు.