వేల్పూర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు పలు మండల కేంద్రాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల్పూర్ ఎక్స్రోడ్డులోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గంలోని రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. ఎరువుల ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎరువుల ధరలు తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేదంటే వారిని గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, భీమ్గల్ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్తోపాటు ముస్కు భూమేశ్, దేవేందర్, ప్రవీణ్రెడ్డి, దొన్కంటి నర్సయ్య, పూర్ణానందం, సొసైటీ చైర్మన్లు మోహన్రెడ్డి, జక్క రాజేశ్వర్, కుంట ప్రతాప్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బాల రాజేశ్వర్, రైతుబంధు సమితి సభ్యులు శర్మానాయక్, నాగధర్ తదితరులు పాల్గొన్నారు.
ధరలను తగ్గించకుంటే ఉద్యమిస్తాం..
బోధన్, జనవరి 14: పెంచిన ధరలను తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీఆర్ఎస్ బోధన్ పట్టణ నాయకులు కేంద్రాన్ని హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్యాదవ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్, నియోజకవర్గ నాయకుడు తూము శరత్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, నాయకులు పి.గంగాధర్గౌడ్, నక్క లింగారెడ్డి, గుమ్ముల అశోక్రెడ్డి, జాడె సతీశ్, టి.ఇంద్రకరణ్, తోకల గంగారెడ్డి, చందు, కౌన్సిలర్లు బెంజర్ గంగారాం, ధూప్సింగ్, పిట్ల సత్యనారాయణ, జావిద్, అబ్దుల్లా, శ్రీకాంత్గౌడ్, శంకర్గౌడ్, వడ్ల సతీశ్చారి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్ర..
ఎడపల్లి (శక్కర్నగర్), జనవరి 14: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని రైతులకు దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్, బోధన్ ఏఎంసీ డైరెక్టర్ పోల మల్కారెడ్డి అన్నారు. ఎడపల్లిలోని సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేరెడి శ్రీరాం, ఎడపల్లి ఉపసర్పం చ్ ఆకుల శ్రీనివాస్, రైతు నాయకులు బంజ శంకర్, అహ్మ ద్, నాయకులు లాయఖ్, నాయుడు పోతన్న, గుంజరి రెడ్డి, గంగాధర్, కర్రోళ్ల గంగారాం పాల్గొన్నారు.