మారేడ్పల్లి : మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి వ్యాయామం చేయడం అత్యంత అవసరమని కంటోన్మెంట్ శాసన సభ్యుడు సాయన్న అన్నారు. మారేడ్పల్లిలో ల్యాబ్ పలేస్త్ర పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ శాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ..ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని అన్నారు. తెలంగాణ ప్రముఖ మోడల్ రక్షి ఠాకూర్ మాట్లాడుతూ.విశాలమైన వ్యాయామశాలతో పాటు మంచి శిక్షకుల సమక్షంలో వ్యాయామం నేర్పించడం దీని ప్రత్యేకత అని తెలిపారు.